-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గురువారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయం సమీపంలోని గ్రీన్ పార్క్ సిటీ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ప్రజలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి దుర్గేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరారంభం …
Read More »Tag Archives: rajamandri
జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు
-ఇసుక రవాణాలో అధిక లోడింగ్పై పర్యవేక్షణ పెంచాలి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని (జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు) రహదారి భద్రతపై ప్రజలు, వాహనదారుల్లో విస్తృత అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయిలో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో “SADAK SURAKSHA ABHIYAN” పోస్టర్లు, గోడపత్రికలను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …
Read More »నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి పలువురు శుభాకాంక్షలు
-ప్రభుత్వ పథకాలు–అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధత అవసరం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపు కు స్పందించి నోట్ పుస్తకాలు , విద్యార్థులకి ఉపయోగ పడే పుస్తకాలు అందచేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు …
Read More »స్వచ్ఛ రథం నిర్వహణకు 5 మండలాల పరిధిలో దరఖాస్తుల ఆహ్వానం
-డివిపివో వి. శాంత మణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజమహేంద్రవరం, రాజానగరం, కడియం, కొవ్వూరు మండలాల్లో ప్రతి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని “స్వచ్ఛ రథం” నిర్వహణకు అర్హులైన వ్యక్తులు, సంస్థలు, స్క్రాప్ డీలర్లు, వాహన ఆపరేటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలానికి విడివిడిగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ …
Read More »ఇన్నోవేషన్తో MSMEs, స్టార్టప్ల బలోపేతానికి NRDC–RTIH సంయుక్త వర్క్షాప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్నోవేషన్ ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (MSMEs) మరియు స్టార్టప్లను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేధస్సు సంపత్తి హక్కులు (IPR), సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మరియు వాణిజ్యీకరణ అంశాలపై అవగాహన వర్క్షాప్ను నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NRDC), న్యూఢిల్లీ మరియు RTIH – రాజమహేంద్రవరం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆర్టిఐహెచ్ డైరెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ వర్క్షాప్ను 2025 డిసెంబర్ 30న, PGRS హాల్, కలెక్టరేట్, బొమ్మూరు, …
Read More »ఘనంగా ఆర్ఎంసి కార్నివాల్ ముగింపు వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని సుబ్రహ్మణ్య మైదానం నందు నిర్వహించిన ఆర్ఎంసి (RMC) కార్నివాల్ వేడుకలు ఆదివారం అత్యంత ఘనంగా ముగిశాయని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. రెండు రోజులపాటు కొనసాగిన ఈ కార్నివాల్కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా కార్నివాల్కు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలను ఆస్వాదించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన గేమ్స్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, …
Read More »వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్పై అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం వై జంక్షన్ సమీపంలో ఉన్న కల కళాశాల బాలుర వసతి గృహంలో, రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సమతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం, సత్ప్రవర్తన, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఆర్ఎస్ అధికారి, రిటైర్డ్ ఆదాయపన్ను శాఖ అధికారి ఎమ్. తిరుమల కుమార్ మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు …
Read More »నకిలీ ఇసుక వే బిల్లుల పట్టివేత
-ప్రక్కిలంకలో తెల్లవారుజామున సంయుక్త తనిఖీలు – రెండు వాహనాలు స్వాధీనం -ఎడి మైన్స్ డీ ఫణి భూషణ్ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా గనులు & భూగర్భ శాఖ , జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో కలిసి 28.12.2025 తేదీ తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ప్రక్కిలంక గ్రామంలో ఆకస్మిక సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న …
Read More »డిసెంబర్ 29న జిల్లాలో ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీల స్థితి తెలుసుకునే అవకాశం -9552300009 వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా సమర్థవంతంగా పౌర సేవలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిసెంబర్ 29 (సోమవారం) న తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి …
Read More »ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు Citizen e-KYC తప్పనిసరి
-ప్రజల్లో అవగాహన పెంచి, క్షేత్రస్థాయిలో అధికారులు వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో, సమర్థవంతంగా అందాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన చర్యలు కీలకమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,48,969 Citizen e-KYCలు …
Read More »
Prajavartha Online Telugu News