Breaking News

Tag Archives: rajamandri

“ఆహా ఏమి రుచి”.. పాఠశాల మధ్యాహ్న భోజనం పై కలెక్టర్ ప్రశంస

-విద్యార్థులతో కలిసి సహపంతి భోజనం చేసిన కలెక్టర్, జేసి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తాళ్లపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహ పంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని ప్రశంసించారు. “ప్రతిరోజు ఇలాగే ఉంటుందా” అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరుపై కలెక్టర్ పి ప్రశాంతి సంతృప్తి వ్యక్తం చేశారు. …

Read More »

ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల వ్యవధిలోగా స్పష్టంగా స్థానిక భాష మరియు ఇంగ్లీషులో రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించాలి

-సూచనలు పాటించకపోతే AP APMCE Act – 2002 మరియు రూల్స్ 2007 ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయి -డా కె. వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం, విజయవాడ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తమ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల వ్యవధిలోగా స్పష్టంగా స్థానిక భాష మరియు ఇంగ్లీషులో రిసెప్షన్ కౌంటర్లో ప్రదర్శించాల్సినది.అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …

Read More »

జూన్ 30 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్

-“డబల్ వన్ డబల్ జీరో” కి ఫోన్ చేసి పిజిఆర్ఎస్ పరిష్కార స్థాయి తెలుసుకోండి -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  ద్వారా ప్రజలకి పౌర సేవలు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 30 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “డబల్ వన్ …

Read More »

నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మా కృషి

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – 37వ డివిజన్లో పర్యటన – 10వ డివిజన్ తెలుకులవాని పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు పనులు ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని అన్ని ప్రాంతాల కోసం తాము నిత్యం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 37వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే 10వ డివిజన్ పరిధిలోని తెలుకుల వాని చెరువు పార్కులో సందర్శకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు …

Read More »

జిల్లా అధికారులు మరియు అన్ని స్టేషన్ హౌస్ అధికారులతో సమీక్ష

-తూర్పు గోదావరిలో నవోదయం 2.0 పై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఐ పి ఎస్ సమీక్ష .. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవోదయం 2.0 అమలు మరియు పురోగతిని జిల్లా అధికారులు మరియు అన్ని స్టేషన్ హౌస్ అధికారులతో సమీక్షించడానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తూర్పు గోదావరి జిల్లాను సందర్శించారు. తూర్పు గోదావరిని అక్రమ స్వేదన (ID) మద్యం రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా …

Read More »

దేశ సమస్యలకు శాస్త్ర పరిశోధనలు పరిష్కారం చూపాలి

-పరిశ్రమలు పరిశోధనపై దృష్టి సారించాలి -ఆవిష్కరణలు, పరిశోధన ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం -మన ఆలోచనలు భేష్.. కానీ ఉత్పత్తుల్లో వెనుకబడ్డం (ఐడియా రిచ్.. ప్రోడక్ట్ పూర్) -నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత మిస్సైల్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వి. కె. సారస్వత్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశం ఎదుర్కొంటున్న పోషకాహార లోపం, శిశు మరణాలు, మాతృ మరణాలు వంటి సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమని, మన శాస్త్ర పరిశోధనలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని నీతి …

Read More »

ఆశా కార్యకర్తలు పోస్టులు భర్తీ కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యకర్తలు పోస్టులు భర్తీ కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరణ. తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయుటకు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనపర్తి-3, బిక్కవోలు-1, రంగంపేట-2, రాజమహేంద్రవరం రూరల్-4, కడియం-3, రాజానగరం-2, కోరుకొండ-2, సీతానగరం– 2, గోకవరం-1, దేవరపల్లి-3, నల్లజెర్ల-2, తాళ్ళపూడి-1, కొవ్వూరు రూరల్-1, చాగల్లు-1, పెరవలి-1, ఉండ్రాజవరం-1, మండలాలలో 30 ఆశా కార్యకర్తలు పోస్టులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె వెంకటేశ్వర …

Read More »

జిల్లాలో పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధి, ఇకో టూరిజం డీపీఆర్

-గోదావరి పుష్కరాలు నాటికి పర్యాటకులకు అందుబాటులో హోమ్ స్టే -బోటింగ్, రిసార్ట్స్, ఘాట్స్ అభివృద్ధి పై దృష్టి సారించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ప్రాంతం అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ , ఇకో టూరిజం తో కూడిన ప్రణాళిక సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సాయంత్రం పర్యాటక, దేవాదాయ, ఆర్ ఎమ్ సి, కన్సల్టెంట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాట్ల పై కలెక్టర్ పి ప్రశాంతి దిశా నిర్దేశనం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : *అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు , సైన్స్ మ్యూజియం, అటవీ అకాడమీ ప్రారంభోత్సవం తదితర పలు కార్యక్రమాలలో గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాట్ల పై కలెక్టర్ పి ప్రశాంతి దిశా నిర్దేశనం చేశారు. కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలుత అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన …

Read More »

బోగస్ ప్రచారాలను నమ్మకండి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి…

-మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది… -ఆర్పిలకు నూతన ట్యాబ్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బోగస్ ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, మంచి ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తుందని, రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోరంట్ల కార్యాలయం నందు మెప్మా సంస్థ సీవోలు, ఆర్పీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి …

Read More »