Tag Archives: rajamandri

జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

-ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ -దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు.. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు -హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి.. గోదావరికి నిత్యహారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంక, నిడదవోలు..ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ -ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ …

Read More »

జూన్ 23 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in నందు నమోదు చేసుకునే అవకాశం -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  ద్వారా పౌర సేవలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 23వ తేదీ సోమవారం రోజున  యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. …

Read More »

స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా ప్రతిజ్ఞా చేయించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-యోగా ఆంధ్రా సాధనలో పాల్గొన్న విద్యార్థులకి ధ్రువపత్రాలను అందచేసిన ఎమ్మెల్యే గోరంట్ల రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జాతీయ రహదారి పై యోగాంద్ర, స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా, 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో  రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గం శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ , దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప …

Read More »

యోగాతో మానసిక ప్రశాంతత: నోడల్ అధికారి మదర్సా అలీ షేక్

–నగరపాలక సంస్థ కార్యాలయంలో యోగాంధ్ర వేడుకలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఒత్తిడిని జయించేందుకు సంప్రదాయ యోగాను మించిన సాధనం మరొకటి లేదని నోడల్ అధికారి మదర్సా అలీ షేక్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్ ద్వారా విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిలకించారు. మనిషి దైనందిన జీవితంలో యోగా భాగం …

Read More »

స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దాం: కలెక్టర్ పి.ప్రశాంతి

-పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం: ఎమ్మెల్సీ సోమువీర్రాజు -నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ఉష్ణోగ్రతలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని , వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏ కె సి డిగ్రీ కళాశాల సమీపంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా …

Read More »

కమిషనర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ లో శనివారం చార్జ్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎంసి అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు.

Read More »

యోగా సాధన కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి…

-ఇకపై యోగాను అలవాటుగా మార్చుకోవాలి -సరస్వతి, గౌతమి ఘాట్ వద్ద వ్యవసాయ అనుబంధ, పర్యటక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా సాధన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నగరం లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో 14 చోట్ల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా స్థానిక గౌతమీ ఘాట్ దగ్గర డాక్టర్స్ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ హోమియో పతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ …

Read More »

కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

-వినతుల స్వీకరణ కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ 7995367797 -1140 మంది కోకో రైతులు నుంచి అదనంగా మరో 331 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు ఆదేశాలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 546 మంది రైతుల నుంచి 250 .17 టన్నుల కోకో గింజల సేకరణ కోసం చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి వివరాలు …

Read More »

రంగోలి కార్యక్రమం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “One Earth One health” concept పై స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆవరణలో శుక్రవారం రంగోలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమం లో ముఖ్య అతిథులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా… జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి లు హాజరై ముగ్గులను తిలకించి, మహిళలను అభినందించడం జరిగింది. ఈ పోటీలలో పలువురు అధికార, అనధికార, …

Read More »

రెవిన్యూ విభాగం లో సంఘీభావంతో కూడిన విధి నిర్వహణలో పని చెయ్యడం తప్పని సరి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి అధ్యక్షతన రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులను సన్మానించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ప్రజలే ముందు అనే విధానంలో , మార్గదర్శకాలు విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవిన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి విజ్ఞప్తి చేశారు. …

Read More »