Tag Archives: rajamandri

యోగాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం

-జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు -మే 29 వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం -సీఎం యోగా సాధన ఆదర్శం స్పూర్తి: -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వంతుగా సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోనీ స్థానిక డీ ఆర్ వో ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో …

Read More »

కోకో పెంపకాన్ని ప్రోత్సాహం అందించాలి

-కోకో సాగులో అంతర్ పంట ద్వారా అదనపు ఆదాయం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కోకో తోట పంటల విస్తరణ పై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ తద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , 600 హెక్టార్లలో కోకో …

Read More »

జీవవైవిద్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

-సెంట్రల్ జైల్ సూపరెంటిండెంట్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జీవవైవిధ్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొక్కల సంరక్షణ, నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రాహుల్ మాట్లాడుతూ గత ఏడాది రాజమండ్రి కేంద్ర కారాగారానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవవైవిధ్య …

Read More »

తూర్పు నాబార్డ్ డిడిఏం గా చక్రధర్ రావూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నాబార్డ్ జిల్లా అభివృధి మేనేజర్ (డి డి ఎమ్) గా చక్రధర్ రావూరి కొత్త గా పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసిన చక్రధర్ బదలీపై తూర్పు గోదావరి జిల్లా కు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు జిల్లాలకు ఏ జి ఎమ్ గా వ్యవహరించిన డా వై ఎస్ నాయుడు కాకినాడ, కోనసీమ జిల్లాల నాబార్డ్ ఏజీఏం గా …

Read More »

తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను

– ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను – నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు – మంత్రిమండలి ఆమోదం తెలిపింది – ఇది కూటమి ప్రభుత్వ విజయం – మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు – మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి …

Read More »

మన ధరిత్రి మన ఆరోగ్యం

-జూన్ 21 వరకు యోగపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు -మంత్రం కందుల దుర్గెష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యంn(“యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్”) అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమముగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా “యోగాంధ్ర ప్రదేశ్” ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు గౌతమి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం సాయంత్రం యోగాంధ్ర ప్రచార కార్యక్రమం, పర్సెప్షన్ సర్వే పై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, పురపాలక కమిషనర్ల లతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. “వన్ నేషన్- వన్ హెల్త్” నినాదంతో …

Read More »

ఇంటర్వ్యూ లకు అర్హత కలిగిన, అర్హత పొందని వెబ్ సైట్ లో ప్రదర్శన

– జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ వాత్సల్య, వన్ స్టాప్ సెంటర్ , చిల్డ్రన్ హోమ్ లలో పోస్టుల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో అర్హత కలిగిన, అనర్హత కలిగిన అభ్యర్ధుల జాబితా తూర్పు గోదావరి జిల్లా వెబ్సైట్ లో ప్రదర్శించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వారి తరపున మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు …

Read More »

ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ

-పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు -వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని తెలిపిన మంత్రి దుర్గేష్ -తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా -గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ -తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాం ఉగ్రమూకల దారుణకాండలో అసువులు …

Read More »