Tag Archives: rajamandri

సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’ మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (16-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) …

Read More »

సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్ళిన మంత్రి దుర్గేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ఉత్సాహంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ” శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో …

Read More »

నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పట్టణంలో రూ. 90.41 లక్షల వ్యయంతో 11 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రూ.82.11 లక్షల మున్సిపల్ సాధారణ నిధులు, రూ.8.30 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతుల కల్పించామని వెల్లడి -రూ.77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, రూ.4 లక్షల విలువైన ప్రహారీగోడ, రూ.6.35 లక్షల విలువైన అంగన్ వాడీ కేంద్రం అభివృద్ధికి ప్రారంభోత్సవాలు చేశామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, …

Read More »

పాలు కల్తీ ఘటనకు సంబంధించి అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగిస్తున్నారు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో డెల్టా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్. రామలక్ష్మి (వయసు 73) ఆదివారం ఉదయం 9.35 గంటలకు తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం మొత్తం 9 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో …

Read More »

సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (9-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు …

Read More »

మహిళా సాధికారత నినాదం కాదు… ప్రతి మహిళ జీవితంలో ఆచరణ కావాలి

-బాలికా విద్యతోనే సమాజ మార్పు -తూర్పు గోదావరి జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష …

Read More »

పాలు కల్తీ ఘటనకు సంబంధించి 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో KIMS Hospital లో చికిత్స పొందుతున్న జి. సూర్యారావు  (వయస్సు: 81 సంవత్సరాలు) మంగళవారం దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె వెంకటేశ్వర రావు తెలియజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన …

Read More »

ఇసుక, కంకర అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు

-గత రెండు రోజుల్లో 25 వాహనాలు సీజ్  కేసులు నమోదు -జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి రాజహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర మరియు ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందనీ , అందులో భాగంగా ఫిబ్రవరి 28, మార్చి ఒకటవ తేదీలలో కడియం మండలం పరిధిలో, బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే హైవే మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో రూట్ చెక్ …

Read More »

పాల విక్రయ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు

-150 నమూనాల సేకరణ -పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కు పంపిన అధికారులు -అనంతపురంలో నాణ్యతలేని వంద లీటర్ల పాల పారబోత -మరో వారం వరకు తనిఖీల కొనసాగింపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలకు శ్రీకారం చుట్టింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అనుసరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల నుంచి …

Read More »

అవసరమైన యాంటీడోట్ ఇంజెక్షన్ అందుబాటులో

-నేడు చేపట్టిన ఇంటింటి సర్వేలో కొత్తగా కేసులు నమోదు కాలేదు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు అవసరమైన యాంటీడోస్ ఇంజెక్షన్ అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. రవి రాజు సూచనల ప్రకారం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అని తెలియ చేశారు. రాష్ట్రంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో …

Read More »