రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్ళిన మంత్రి దుర్గేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ఉత్సాహంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ” శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారు భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందించాలని, ఎల్లప్పుడూ ప్రజాసేవలో ఉంటూ అందరికీ మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News