-పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ రద్దు -1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు స్వీకరణ –కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ (16వ తేదీ, సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఫిబ్రవరి 16 వ తేదీన రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ …
Read More »Tag Archives: rajamandri
జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు మరింత వేగం పెంచాలి
-మంత్రులు –కార్యదర్శుల సమావేశంలో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న “మంత్రులు–కార్యదర్శుల కాన్ఫరెన్స్”లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్డీపీ వృద్ధి, జిల్లా వారీ పనితీరు, స్వర్ణాంధ్ర@2047 విజన్ లక్ష్యాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఆర్ ఎమ్ సి కమిషనర్ …
Read More »ప్రజల్లో బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనను పెంపొందించడమే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ప్రధాన లక్ష్యం
-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా, ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఆర్ బి ఐ ద్వారా రూపొందించిన పోస్టర్లను ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »ఫిబ్రవరి 9న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు
-ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న 3వ మంత్రులు–కార్యదర్శుల సదస్సు (Ministers’ and Secretaries’ Conference)కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు మరియు ఇతర జిల్లా అధికారులు వారి బృందం వర్చువల్ విధానంలో హాజరు కావాల్సి ఉన్నందున, ఫిబ్రవరి 9 న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు …
Read More »డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ తూర్పుగోదావరి ఎస్ఈ కె తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారులు ఫోను నెంబరు 8688400499 ద్వారా విద్యుత్ సమస్యలను తెలియజేయ వచ్చన్నారు. ఫిబ్రవరి 9న …
Read More »బాలికల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించి అక్కడ బాలికలకు అందుతున్న వసతులు, సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న బాలికలతో సన్నిహితంగా మాట్లాడి వారి విద్య, ఆరోగ్యం, భద్రత, భోజనం, దైనందిన అవసరాలు తదితర అంశాలపై వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అడిగి తెలుసు కున్నారు. బాలికలు బాగా …
Read More »సహజ వన్యప్రాణి లక్షణాలకనుగుణంగా ప్రవర్తించిన పులి – నాలుగు గంటలు పాకలో ఉన్నా పశువులకు హాని చేయలేదు
-జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు -అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అప్రమత్తత ప్రశంసనీయం : కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పులి గుడిసె ఇంట్లోకి ప్రవేశించి, అదే పాకలో సుమారు నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »గుడిసెలో నాలుగు గంటలు ఉన్నా పశువులకు హాని చేయని పులి
-డి ఎఫ్ వో ప్రభాకర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించిన పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే , అదే పాకలో ఉన్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా …
Read More »2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం
-రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -20 నెలల్లో రూ.30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం -“ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని …
Read More »త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. తొలుత విమానాశ్రయ అధికారులు, ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సమీక్షించి, టెర్మినల్ భవనం నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మార్చి 31నలోపు పూర్తి …
Read More »
Prajavartha Online Telugu News