Tag Archives: rajamandri

సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (9-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు …

Read More »

మహిళా సాధికారత నినాదం కాదు… ప్రతి మహిళ జీవితంలో ఆచరణ కావాలి

-బాలికా విద్యతోనే సమాజ మార్పు -తూర్పు గోదావరి జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష …

Read More »

పాలు కల్తీ ఘటనకు సంబంధించి 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో KIMS Hospital లో చికిత్స పొందుతున్న జి. సూర్యారావు  (వయస్సు: 81 సంవత్సరాలు) మంగళవారం దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె వెంకటేశ్వర రావు తెలియజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 13 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన …

Read More »

ఇసుక, కంకర అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు

-గత రెండు రోజుల్లో 25 వాహనాలు సీజ్  కేసులు నమోదు -జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి రాజహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర మరియు ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందనీ , అందులో భాగంగా ఫిబ్రవరి 28, మార్చి ఒకటవ తేదీలలో కడియం మండలం పరిధిలో, బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే హైవే మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో రూట్ చెక్ …

Read More »

పాల విక్రయ, నిల్వ కేంద్రాల్లో తనిఖీలు

-150 నమూనాల సేకరణ -పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కు పంపిన అధికారులు -అనంతపురంలో నాణ్యతలేని వంద లీటర్ల పాల పారబోత -మరో వారం వరకు తనిఖీల కొనసాగింపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలకు శ్రీకారం చుట్టింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అనుసరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల నుంచి …

Read More »

అవసరమైన యాంటీడోట్ ఇంజెక్షన్ అందుబాటులో

-నేడు చేపట్టిన ఇంటింటి సర్వేలో కొత్తగా కేసులు నమోదు కాలేదు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలుషిత పాలు కారణంగా వైద్య సహాయం అవసరమయ్యే రోగులకు అవసరమైన యాంటీడోస్ ఇంజెక్షన్ అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. రవి రాజు సూచనల ప్రకారం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అని తెలియ చేశారు. రాష్ట్రంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో …

Read More »

ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

-మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా -ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాకు వొచ్చిన ఆరోగ్య కమిషనర్ వీర పాండ్యన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాధితులకు పూర్తి వైద్య ఖర్చులు భారం ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి, ధైర్యం కల్పించడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీర పాండ్యన్ తెలిపారు. సోమవారం కిమ్స్ , రెయిన్బో ఆసుపత్రులను ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులతో కలిసి …

Read More »

ప్రజలు భయాందోళన చెందవద్దు

-పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది -ఫిర్యాదులకై హెల్ప్‌లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించవచ్చు -కలెక్టర్ కీర్తి చేకూరి -ప్రజలు సంయమనం పాటించాలి: ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వై జంక్షన్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

నిడదవోలులో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..

-పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిడదవోలు రూరల్ మండలం కాటకోటేశ్వరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారిని మంత్రి దుర్గేష్ ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణ తేజతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి …

Read More »

ఫిబ్రవరి 17న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి కే హరీష్ చంద్ర ప్రసాద్. -జిల్లా నైపుణ్యాధికారి విడిజీ మురళి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »