Tag Archives: rajamandri

జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ – విశేష స్పందన

-మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు -వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు -వైద్య బృందానికి ప్రజా ప్రతినిధుల ప్రశంసలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల …

Read More »

గిరిజన సంక్షేమ కమిషన్ సభ్యులు మార్చి 28,29 తేదీల్లో జిల్లాలో పర్యటన

– జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యులు కె. మల్లేశ్వరరావు, కె. లక్ష్మి లు మార్చి 28, 29 తేదీలలో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, మర్యాదలు కల్పించాలని గౌరవ చైర్మన్ ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. 28వ తేదీ ఉదయం 06.20 నుండి 09.30 గంటల …

Read More »

తూర్పు గోదావరిలో పైప్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలి

-పైపు లైన్లు ఏర్పాటు చేసిన ఏరియాలోని గృహాలకు గ్యాస్ సరఫరా కు కార్యాచరణ సిద్ధం చేయాలి -జేసి వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గృహాలు, వాణిజ్య సంస్థలు మరియు పారిశ్రామిక అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువు సరఫరాను విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో Godavari Gas Private …

Read More »

ఆంధ్రప్రదేశ్ పామ్ ఆయిల్ మిల్లుల ఆధునికీకరణకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి

– ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం / న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దగ్గుబాటి పురందేశ్వరి భారత పార్లమెంట్ లో Rule 377 కింద అత్యవసర ప్రజా ప్రాధాన్యత గల అంశంగా ఆంధ్రప్రదేశ్‌లో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఆధునికీకరణ అవసరాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.49 లక్షల హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు జరుగుతుండగా, ముఖ్యంగా తూర్పు మరియు …

Read More »

జి జి హెచ్ – వైద్య కళాశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ – మానవ హారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రజల్లో క్షయవ్యాధి పట్ల సమగ్ర అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య విద్యార్థులు మరియు ప్రజల భాగస్వామ్యం కీలకమని డా. కె.వి. శివ ప్రసాద్ పేర్కొన్నారు. సమాజంలో క్షయవ్యాధిపై అపోహలను తొలగించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సమయానుకూల చికిత్స ద్వారా టిబిని పూర్తిగా నివారించవచ్చని ఆయన సందేశం ఇచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ధవళేశ్వరం లోని రూరల్ హెల్త్ …

Read More »

మార్చి 31 నాటికి నూరు శాతం పన్నుల వసూలు లక్ష్యం సాధించాలి

-కమిషనర్ వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్ను వసూళ్లే ప్రధాన ఆధారమని, మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని వి.ఆర్. కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆనం కళా …

Read More »

వార్షిక రుణ లక్ష్యాలలో జిల్లాలో 99.32% ప్రగతి

-సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా పంట రుణాలు మంజూరు చేయాలి -పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026–27 పుస్తకావిష్కరణ -జిల్లా సంయుక్త కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాంకర్లు తప్పనిసరిగా పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలియ చేయడం జరిగింది. మంగళవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్‌లోబ్యాంకర్ల తో జిల్లా సలహా కమిటీ …

Read More »

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత Robert Koch చిత్రపటానికి పూలమాలలు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగాముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ , ప్రపంచ క్షయవ్యాధి …

Read More »

సంతోషాన్ని మించిన ఆస్తి లేదు

-కమిషనర్ రాహుల్ మీనా -అట్టహాసంగా ఆర్ఎంసి హ్యాపీ ఫెస్ట్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవితంలో సంతోషాన్ని మించిన ఆస్తి మరొకటి లేదని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు నుంచి ఈట్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఆర్ఎంసి హ్యాపీ ఫెస్ట్ ను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల వెలుగులో వినోదాన్ని పంచే ఆటలు, లైవ్ మ్యూజిక్, సెల్ఫీ పాయింట్స్, స్టాండప్ కామెడీ, మ్యాజిక్ షో, కామెడీ స్కిట్స్, ఫుడ్ స్టాల్స్ సందర్శకులను …

Read More »

కేంద్ర కారాగారము రాజమహేంద్రవరంలో మామిడి తోటల కౌలు హక్కుల బహిరంగ పాట

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కారాగారము రాజమహేంద్రవరం పరిధిలోని ఆరు బయలు కారాగారములో సుమారు 10 ఎకరముల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటల పంటలకు ఒక సంవత్సర కాలానికి కౌలు హక్కుల మంజూరు కోసం ది.24.03.2026 మంగళవారం ఉదయం 11.00 గంటలకు బహిరంగ పాట నిర్వహిస్తున్నట్లు కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ కార్యక్రమం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, కోస్టల్ ఆంధ్ర రేంజ్, రాజమహేంద్రవరం వారి సమక్షంలో జరుగు …

Read More »