Breaking News

మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు

రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని నేటి శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఆర్టిజి, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు సాదర వీడ్కోలు లభించింది. మంత్రివర్యులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, అదనపు ఎస్పీ నాగభూషణం రావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్ తదితరులు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ముందుగా మంత్రి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, శ్రేణులను ఆత్మీయంగా పలకరించి, మీడియాతో మాట్లాడిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *