తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిరుపతి విష్ణు నివాసం వద్ద నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనాలను వడ్డిస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, …
Read More »Tag Archives: tirupathi
డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారత పౌరునికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య మరియు …
Read More »విద్య ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమని అంబేద్కర్ చెప్పిన సందేశాన్ని యువత ఆచరణలో పెట్టాలి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ముత్యాలరెడ్డి పల్లి, సీతమ్మ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల …
Read More »సమానత్వం, సామాజిక న్యాయం అంబేద్కర్ ఆశయం – దానికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన: ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతి బస్టాండు ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డితో కలిసి పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలో ప్రతి ఒక్కరికీ సమానత్వం, సామాజిక న్యాయం అందాలని లక్ష్యంగా పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు బాగుండాలంటే …
Read More »ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :ఎన్టీఆర్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ప్రాణాలను రక్షించే అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆనందదాయకమని …
Read More »తిరుపతిలో బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :దేశ మాజీ ఉపప్రధాని, మహానేత బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కార్యక్రమంలో …
Read More »మార్చి 30 వ నాయుడుపేట పుదూరు గ్రామం నందు టిడ్కో గృహాలను ప్రారంభోత్సవo చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-పర్యటన ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ -ఏర్పాట్లను పట్టిష్టంగా ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 30 వ నాయుడుపేట పుదూరు గ్రామం నందు టిడ్కో గృహాలను ప్రారంభోత్సవo చేయనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం నాయుడుపేటలోని పుదూరు గ్రామం వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను జిల్లా ఎస్.పి ఎల్.సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, …
Read More »ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్ వెంకటేశ్వర్
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24 x 7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్రపరచబడిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, సి డబ్ల్యూ సి గోదామును గురువారం రాజకీయ …
Read More »2026–27 జనగణన (16వ సెన్సస్ ఆపరేషన్స్) నిర్వహణకు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
-జనగణన పూర్తిగా ఆన్లైన్ యాప్ ఆధారంగా (CNN App) నిర్వహించబడుతుంది: -జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన ను ఎన్నికల నిర్వహణ మాదిరిగానే సమర్థవంతంగా, క్రమబద్ధంగా అందరూ భాగస్వామ్యం అయి బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జనగణన ద్వారా ప్రజల సంక్షేమం అనే లక్ష్యంతోజనగణన–2027లో భాగంగా హౌస్లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ (HLO) ఫీల్డ్ ట్రైనర్లకు తిరుపతి కలెక్టరేట్లోని …
Read More »ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి‘మీ ఇంటికి – మీ డాక్టర్ ప్రాజెక్టు’
-మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ -మారుమూల గ్రామీణ ప్రాంతాల లో నివసించే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు -మొబైల్ మెడికల్ యూనిట్ వాహనo ద్వారా రోజుకు 100 మంది రోగులకు వైద్య సేవలు అందించడం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News