Breaking News

Devotional

హనుమాన్ జన్మోత్సవం

-ఆంజనేయమంగళాష్టకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ || కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ || భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ || పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే | సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || …

Read More »

తోమాలసేవ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసునికి అనేక పుష్పమాలలతో, తులసిమాలలతో, అనునిత్యం చేసే సేవాకైంకర్యమే. “తోమాలసేవ”. తమిళంలో ‘తోడుత్తమాలై’ అంటే నారతో కట్టిన మాల అని అర్థం. కాలక్రమంలో అదే ‘తోమాల’ గా మారి ఉండవచ్చు. ‘తోల్’ అంటే భుజం అని అర్థం. భుజం నుంచి వ్రేలాడే మాలలు గనుక ‘తోమాలలు’ అని అంటారు. ముందురోజు రాత్రే ఆయా కాలాల్లో లభించే అనేక రకాల, రంగురంగుల, పరిమళ పుష్పాలతో తయారు చేయబడిన పుష్పమాలికలను, విమాన ప్రదక్షిణం లోని యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనపున శీతల …

Read More »

అప్పన్న స్వామికి చందన సమర్పణ

సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త : వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున రెండు గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన శ్రీ గ్రంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. …

Read More »

మే 23 బుద్ధ పూర్ణిమ… బుద్ధుడు చెప్పింది విందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 23 బుద్ధ పూర్ణిమ… భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ కు బుద్ధుడు బోధనలు స్ఫూర్తిగా నిలిచాయి. అహింస ద్వారానే ఏదైనా సాధించగలమని బుద్ధుడు పలుమార్లు చెప్పారు. గౌతమ బుద్ధుడు 29 సంవత్సరాల వయస్సులో సన్యాసం తీసుకున్నారు 6 సంవత్సరాల పాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆచరించిన సత్యం, అహింస, ధర్మం, దయ కోసం ప్రజలను ప్రేరేపించారు. ఆ మార్గాన్ని అనుసరించడానికి బౌద్ధమతాన్ని స్థాపించారు. బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని …

Read More »

ఈవిఎంలను కమిషనింగ్ ఏర్పాట్లు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంల ర్యాండమైజేషన్ మేరకు ఈవిఎంలను కమిషనింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం స్థానిక ఏసి కాలేజిలో జరగనున్న ఈవిఎంల కమిషనింగ్ ఏర్పాట్లపై తూర్పు నియోజకవర్గంలోని పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో, అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఈవిఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని …

Read More »

సిరి కొలువు

-తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచాన అనగా శ్రీకాంత. సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఆ జగన్మాత కొలువై వున్న ఊరే ‘తిరుచాన ఊరు’. అదే ‘తిరుచానూరు’గా మారిందని కొందరంటారు. చాల కాలం కిందట ఇది శ్రీ శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం. అందువల్లే ఈ ప్రదేశం ‘శ్రీశుకుని ఊరు”గా పిలువబడిందనీ, అదే కాలక్రమంగా ‘శ్రీశుకనూరు’ అనీ, ‘తిరుచ్చుకనూరు’ అనీ, ‘తిరుచానూరు’ అని పిలువ బడిందని మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ దివ్యదేశంలో శ్రీ శుకమహర్షి …

Read More »

శ్రీవారి పచ్చకర్పూరం యొక్క మహిమ!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా …

Read More »

శ్రీ సరస్వతీ దేవి, (శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా | శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారములో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలానక్షత్రంరోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది. సరస్వతీదేవిని సేవించడం వలన, వాగ్దేవి అనుగ్రహం కలిగి విద్యార్ధినీ విద్యార్ధులు సర్వ విద్యలయందు విజయం పొందుతారు. భక్తులు మూలానక్షత్రం …

Read More »

శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్ర‌కీలాద్రి, శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 4వ రోజైన బుధ‌వారం ఆశ్వ‌యుజ శుద్ధ చ‌వితి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తుంది. యాదేవీ స‌ర్వభూతేషు ల‌క్ష్మీరూపేణ సంస్థితా.. అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి.. అని చండీ స‌ప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, …

Read More »

జులై 3న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు గురు పౌర్ణ‌మి కావ‌డం విశేషం.ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Read More »