Breaking News

Devotional

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అలాగే ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, జులై నెల‌కు సంబంధించిన అష్ట‌ద‌ళ‌పాద ప‌ద్మారాధ‌న సేవ టికెట్ల‌ను రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే …

Read More »

న‌వీ మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ‌ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మ‌హారాష్ట్ర మంత్రి

-ముంబైలో శ్రీ‌వారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వ‌చ్చిన రేమండ్ సంస్థ‌ తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉద‌యం బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు చైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను …

Read More »

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వెంక‌న్న‌ చక్రస్నానం…

-ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, …

Read More »

శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అడవి మార్గంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అన్నదానం, మంచినీరు సౌకర్యాలు సిద్దం చేశామన్నారు. ఈ నెల 20వ …

Read More »

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్…

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల బుధవారం  ఉదయం నైవేద్య విరామం అనంతరం శ్రీ‌వారిని హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్ ద‌ర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదఆశీర్వచనం చేపించి అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తి.తి.దె చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తో ,తిరుపతి ఎం.పి మద్దిల గురుమూర్తి, దేవదాయ-ధర్మదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

అంగరంగ వైభవంగా16 నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి కల్యాణోత్సవాలు…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమైన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మవారి కల్యాణ మహోత్సవాలు ( పెద్ద తిరునాళ్ల ) ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకు జరగనున్నాయి. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణంతో పాటు 41 రోజుల శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు పాటు మండల దీక్ష చేపట్టిన వేలాది మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించేం దుకు తగిన ఏర్పాటు ఆలయ అధికారులు చేస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి..నేటి నుంచి వరుసగా పెళ్లి ముహుర్తాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …

Read More »

శ్రీ‌నివాస‌మంగాపురంలో విశేష రోజుల్లో వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వ సేవ‌…

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ముఖ్య ప‌ర్వ‌దినాల్లో నిర్వ‌హించే క‌ల్యాణోత్స‌వాన్ని వ‌ర్చువ‌ల్ సేవ‌గా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. భ‌క్తులు ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 12న ఏకాద‌శి, ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 16న చైత్ర పౌర్ణిమ‌, మే 21న శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా ఈ సేవ‌ నిర్వ‌హిస్తారు. అలాగే, జూన్ 11న ద్వాద‌శి, జూన్ …

Read More »

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు…

-డ్రైవ‌ర్లు మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. తిరుమ‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌గా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియ‌న్, అత‌ని స్నేహితులను క‌లిపి ముగ్గురిని విచారించారు. తిరుప‌తిలో ఆటో …

Read More »

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు గవర్నర్ కు ఆహ్వానం…

-చిన్నజీయర్ స్వామి తరుపున స్వాగతించిన తలశిల, చెవిరెడ్డి భక్తబృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల పులకించేలా విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో రూపుదిద్దుకున్న సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనా మహోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం పలికారు. త్రిదండి చిన జీయర్‌ స్వామి సత్‌ సంకల్పం ఫలితంగా సాకారమయ్యే ఈ మహోత్సవ ఘట్టానికి విచ్చేయాలని శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురాం, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితర భక్త బృందం సభ్యులు గౌరవ …

Read More »