Breaking News

Daily Archives: July 14, 2024

శ్రీ అమ్మవారికి బంగారు భోనం…

ఇంద్రకీలాద్రి,, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే (గత 15 సంవత్సరాలుగా) ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య  మరియు కమిటీ సభ్యులు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోనం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు  స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ …

Read More »

కమిషనర్ కార్యాలయం లోని పలు పోలీస్ విభాగాలను పరిశీలించిన సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఐ.పి.ఎస్., శనివారం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో పోలీస్ కమిషనర్ ఈ రోజు కార్యాలయం లోని పలు విభాగాలు అయిన సిటి స్పెషల్ బ్రాంచ్, పాస్ పోర్ట్స్ వింగ్, సిటి క్రైమ్ రికార్డు బ్యూరో, సైబర్ సెల్, ఐ.టి.కోర్ వింగ్, ఫింగర్ ప్రింట్ యూనిట్, పరిపాలనా విభాగాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకుని పలు …

Read More »

అధిక వర్షాలు – వరి పంటలో తక్షణ రక్షణ చర్యలు

-జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు రైతులకి సూచనలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరి నాట్లు జరుగుచున్న ప్రస్తుత తరుణంలో అధిక వర్షాలకు జిల్లా లోని 10 మండలాల్లోని లోతట్టు గ్రామాలలో 917 హెక్టార్ల వరి పంట ఒక అడుగు వరకు మునగటం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రస్తుతం నాట్లు వేసి 15 నుండి 16 రోజుల దశలో వున్నందున పంటకు సాధారణంగా ఏటువంటి నష్టం వాటిళ్ళనప్పటికి , అధిక …

Read More »

నగరంలో “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో “ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్” (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో విజయవాడ, బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న”ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ …

Read More »

శాస్త్రీయ అంశాలపై అవగాహన కోసమే “పొలం పిలుస్తోంది”

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్న గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (GAP), భూసార పరిరక్షణ, భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం, రాయతీ పై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయి లో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం …

Read More »

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అర్హతలు: 1. వయసు: 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 2. విద్యార్హతలు: కనీసం ఇంటర్మీడియట్ (12th) లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ. 3. రాష్ట్ర పౌరులు: అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి. …

Read More »

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో పిడుగురాళ్ల లో శరవేగంగా జరుగుతున్న పారిశుధ్య పనులు

-డ్రైన్ ల పూడిక తీత తో పాటు ఇళ్ల మధ్యలో ఉన్న ముళ్ళ కంపలు,చెత్తని తొలగిస్తున్న సిబ్బంది -డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండుసార్లు పర్యటించిన పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ -మూడు రోజుల్లోగా మొత్తం పారిశుధ్యం మెరుగుపరచాలని ఆదేశాలు -మంత్రి ఆదేశాలతో పిడుగురాళ్ల తో పాటు సత్తెనపల్లి,నరసరావుపేట,మాచర్ల, వినుకొండ మున్సిపాలిటీ సిబ్బంది తో పనులు చేయిస్తున్న అధికారులు -పారిశుధ్య పనుల్లో పాల్గొన్న 300 మందికి పైగా కార్మికులు, సిబ్బంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో …

Read More »

ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం

-అన్నివేళలా అందుబాటులో ఉంటాం -ఎన్జీవో నేత ఎండి ఇక్బాల్ సేవలు స్పూర్తి దాయకం. -ఏపీ ఎన్జీవో సంఘం పోరాటాలు ప్రశంసనీయం -ఎండి ఇక్బాల్ పదవీ విరమణ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదు ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు అనుభవించిన మానసిక వేదనకు ముగింపు పలికిన వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్రని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉమ్మడి కృష్ణా …

Read More »

“అగ్నివీర్వాయుని” పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : భారత వైమానిక దళంలో చేరడానికి ఆసక్తి ఉన్న, తగిన విద్యార్హత కలిగిన యువత నుంచి “అగ్నివీర్వాయుని” పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆమేరకు దరఖాస్తు, పరీక్షకి హాజరైయ్యే విధానం పై విమానయాన సంస్థ అధికారులు వివరాలు తెలియ చేశారన్నారు. రాజమండ్రీ ఆర్డీవో, జిల్లా ఉపాధి కల్పనా అధికారులు సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ …

Read More »

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి సవిత

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్‌ వద్ద నేడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్‌ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని …

Read More »