-ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరినందుకు విద్యే ఆయుధం -ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యున్నత స్థాయి ప్రమాణ విద్య అందించడమే ధ్యేయం – మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానములో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం సమీశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి …
Read More »Monthly Archives: July 2024
విశ్వ నటనా చక్రవర్తి నటసార్వభౌమ స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహానికి నివాళులు
-సాంస్కృతికి పరంగా ఎంతో పేరుగాంచిన రాజమహేంద్రవరాన్ని మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తా… -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కళా రంగానికి ఎనలేని సేవలు అందిచడతో పాటు, ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించిన మహనీయులు కళామతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ ఎస్వీ రంగారావు ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్వర్గీయ …
Read More »తాడిపూడి పంపింగ్ స్కీం ద్వారా ఆయికట్టుకు సాగునీరు విడుదల.
-ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. -రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తాళ్లపూడి , నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జల వనరులు శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం ” తాడిపూడి పంపింగ్ స్కీం ” ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో …
Read More »ప్రజలకి, అధికారులకి ప్రతీ రోజూ సా.3 నుంచి సా.4 గంటల వరకు అందుబాటులో కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్యాలయ పని దినాలలో కలెక్టరేట్ నందు ప్రతి రోజు సా.3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులకి అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలియ చేశారు. కావున ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు.
Read More »రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలు తీర్చిదిద్దుతాం-పరిశ్రమల మంత్రి టీజీ భరత్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అతిపెద్ద పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం మంత్రి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి గన్నవరం మండలం మల్లవల్లి, బాపులపాడు మండలం వీరపనేని గూడెం పారిశ్రామిక వాడలను సందర్శించి పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ …
Read More »రూ. 100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వెర్మీరియన్ కంపెనీ సిద్ధం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యక పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో వెర్మీరియన్ కంపెనీ ప్రతినిధులు మంత్రి టి.జి భరత్తో సమావేశమయ్యారు. శ్రీసిటీలో ఉన్న వెర్మీరియన్ కంపెనీ యూనిట్ను విస్తరించేందుకు మంత్రితో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ. 100 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెర్మీరియన్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. …
Read More »గన్నవరం ఎయిర్పోర్ట్లో కార్గో సేవలు పునఃప్రారంభం..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సేవలు అందబాటులోకి వచ్చాయని.. అందరూ ఉపయోగించుకోవాలని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రాబోయే అంతర్జాతీయ సర్వీస్ (కార్గో కోసం) నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి 2021లోనే కార్గో సేవలు ప్రారంభంకావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇప్పటికి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గన్నవరం ఎయిర్ పోర్టులో ఒమేగా కంపెనీ కార్గో సర్వీసును పునరుద్ధరించడం అభినందనీయం అని గన్నవరం ఎయిర్ పోర్ట్ …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కార్తికేయ మిశ్రా
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈవో కె ఎస్ రామరావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Read More »ఊరూరా మీసేవ….!
-మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు -ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్ల ఎంపిక -ఒక్కో కేంద్రానికి రూ.2.50 లక్షల రుణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది. పంద్రాగస్టు నాటికి …
Read More »జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుందన్నారు.
Read More »