రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యాలయ పని దినాలలో కలెక్టరేట్ నందు ప్రతి రోజు సా.3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులకి అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలియ చేశారు. కావున ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News