Breaking News

Daily Archives: August 21, 2024

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర

-అసమానతలను ఎదుర్కొంటూ రాణిస్తున్న ఆర్ఐఎన్ఎల్ కలెక్టివ్స్ శక్తికి అభినందనలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు & భూగర్భ శాస్త్రం మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఆర్ఐఎన్ఎల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అతుల్ భట్ సిఎండి, ఆర్ఐఎన్ఎల్ మరియు డైరెక్టర్లు మరియు ఇతర సీనియర్ అధికారులతో సంభాషించారు. విశాఖపట్నం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాలుకు సంబంధించిన వివిధ అంశాలను వీరు చర్చించారు. తర్వాత ప్లాంట్ సందర్శన సందర్భంగా మంత్రి ఈడీ వర్క్స్ బిల్డింగ్ …

Read More »

ఎసెన్షియా సంస్థలో ఘోర ప్రమాదంపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే …

Read More »

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి

-కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు -పగడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు: నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్ లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. …

Read More »

రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలి

-నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి -శాంతి భద్రతల విషయంలో రాజీలేదు….పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు -ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి -విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా! -డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి….గంజాయి, డ్రగ్స్ తరిమేయండి -ఏపి పోలీసు శాఖ ప్రతిష్ట మళ్లీ నిలబెడదాం…ప్రజల భద్రతకు భరోసా ఇద్దాం -హోం శాఖలో రివ్యూలో నారా చంద్రబాబు నాయుడు -2014-19 పోల్చితే 2019-24 …

Read More »

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

-జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోవడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనే సమాచారం పై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి జిల్లా …

Read More »

అచ్యుతాపురం ఫార్మాకంపెనీలో ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం

-ప్రమాదంపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం -బాధితుల పరామర్శకు రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి బుధవారం నిరంతరం సమీక్ష చేశారు. సహాయక …

Read More »

రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్లకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన పారిశ్రామికవేత్త ఠాగూర్

-రాజధానికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చిన ఎన్వీ నారాయణ రెడ్డి -అభినందించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బుధవారం సచివాలయంలో కలిసి చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు కోటి రూపాయలు చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. కడప జిల్లా, పాయసం పల్లెకు చెందిన …

Read More »

థర్డుపార్టీ ఏజన్సీల వల్లే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి

-అనకాపల్లి సెజ్ లో జరిగిన అగ్నిప్రమాద బాదితులకు తక్షణ సహాయ చర్యలు అందజేస్తున్నాం -రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డు పార్టీ ఏజన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రణా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ప్యాక్టరీలు, బాయిలర్స్ & భీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో …

Read More »

అచ్యుతాపురం సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి టి.జి భ‌ర‌త్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీతో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌ సేవ‌లు అందించాల‌ని చెప్పారు. హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో ఫోన్‌లో మాట్లాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని టి.జి భ‌ర‌త్ కోరారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు అక్క‌డే …

Read More »

అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై అధికారులతో బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా..ప్రాజెక్టు వివరాలు, పెండింగ్ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. స్మృతి వనం ప్రాజెక్టును ఏపీఐఐసీ నిర్మిస్తోందని, దాని నిర్వహణ బాధ్యతలు విజయవాడ మున్సిపల్ …

Read More »