Breaking News

Daily Archives: October 25, 2024

రేపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

-సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 26 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు …

Read More »

ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

-నిర్వీర్యమైన వీధిదీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు సీఎం నిర్ణయం -గ్రామ, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు రూ.150 కోట్లు విడుదలకు సీఎం అంగీకారం -55 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌల వినియోగానికి నిర్ణయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు …

Read More »

మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

-పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చెయ్యాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి…చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని…దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సిఎం సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద …

Read More »

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన ఉపాధితో మంచి జీవితాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్ సంస్థ) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ శ్రీ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని సీడ్ యాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధి పై వర్క్ షాపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీడ్ యాప్ …

Read More »

నేటి నుండి 2025 ఫిబ్రవరి, 28 వరకు 21వ అఖిల భారత పశుగణన ప్రక్రియ…

-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా.నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి నుండి వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్యాప్తంగా 21వ అఖిల భారత పశుగణన ప్రక్రియ జరుగుతుందని, నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా కోరారు‌. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు గణన ప్రక్రియను శుక్రవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు ఇంటి వద్ద …

Read More »

పెండింగ్ బీమా క్లెయిమ్‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాలి

– బాధితుల‌కు సాయ‌మందించ‌డంలో బీమా కంపెనీల కృషి ప్ర‌శంస‌నీయం. – రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల వాహ‌నాలు, వివిధ ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌ల కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని.. ఇంకా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని బీమా సంస్థ‌ల‌కు రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా సూచించారు. శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య …

Read More »

1,80,098 మంది బాధితుల‌కు రూ. 296.82 కోట్లు జ‌మ‌

-జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందించ‌డం జ‌రిగింద‌ని.. 1,80,098 మంది బాధితుల ఖాతాల్లో రూ. 296.82 కోట్లు నేరుగా ఖాతాల్లో జ‌మ‌చేసిన‌ట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌త సెప్టెంబ‌ర్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌లతో జిల్లాలో 179 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలోని ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ్డార‌ని.. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం …

Read More »

ఈ నెల 26న ఏపీ జీఎన్ఏ రాష్ట్ర ఆఫీస్ బేర‌ర్ల ఎన్నిక‌లు

-ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ న‌ర్సుల అసోసియేష‌న్ (ఏపీ జీఎన్ఏ) ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నెల 26న అసోసియేష‌న్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా కోఆప‌రేటివ్ అధికారి, ఏపీ జీఎన్ఏ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రెడ్డి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అసోసియేష‌న్ బైలాస్‌, ఏపీ సీఎస్ (ఆర్‌వోఎస్ఏ) నిబంధ‌న‌లు-2001 ప్ర‌కారం అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని, ఇందులో భాగంగా ఈ నెల 26వ …

Read More »

ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రైడే డ్రై డే సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆదేశాలతో రాష్ట్ర టీం, జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే మీద ప్రజలకు అవగాహన కార్యక్రమము ప్రసాదంపాడు 2 సచివాలయం పరిధిలో నిర్వహించడం జరిగింది. వైద్యాధికారిని డాక్టర్ విజయ్ పర్యవేక్షణలో ఫ్రైడే డ్రై డే ని పురస్కరించుకొని ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డా:మోతి బాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజలు అందరూ …

Read More »

పంట కాలువ కబ్జాపై ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం

-తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశం -ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం… పంట కాలువ పునరుద్ధరణకు చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలోని కోలంక గ్రామంలో పంట కాలువను కబ్జా చేసిన ఘటన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. 60 ఎకరాలకు సాగు నీరు వెళ్ళే పంట కాలువను లే ఔట్ కోసం కబ్జాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఆదేశించారు. తక్షణమే పంట …

Read More »