Breaking News

అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు రూ.3 లక్షల విరాళం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *