Breaking News

Tag Archives: hydarabad

బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్ధ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు… కాబోయే దంపతులు చిలుకూరి సూర్యతేజ, జననిలను ఆశీర్వదించారు.

Read More »

సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నారా, నందమూరి కుటుంబాలు సంస్కృతి-సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయి. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబం మధ్యలో సాధారణంగా, శాస్త్రీయంగా నిర్వహించారు. తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ..మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో .. దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది. హైదరాబాద్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్‌ను …

Read More »

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారం, నేటి పత్రిక ప్రజావార్త : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.

Read More »

డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

-ప్రధాని పర్యటన, ఆటో డ్రైవర్ల సేవలో, జీఎస్టీ ఉత్సవ్‌పై భేటీలో చర్చ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకున్నారు. జ్వరం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎం …

Read More »

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. క్రెడాయ్ …

Read More »

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు

-ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు -జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం -మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం -నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు -నా అభిమానులే నాకు కొండంత బలం -శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి -హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి …

Read More »

ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి

-ఎన్ని జన్మలెత్తినా తెలుగుజాతిలోనే పుట్టాలని కోరుకుంటా -భవిష్యత్‌లో అమరావతి, హైదరాబాద్ సిటీలు మొదటి, రెండవ స్థానంలో ఉంటాయి -తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శం -400 ఛానళ్లతో తిరుగులేని శక్తిగా తెలుగు వన్ -సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం..దీనిపై నియంత్రణ అవసరం. -తెలుగు వన్ డిజిటల్ మీడియా రజతోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగుజాతి ఉంటుందని, నాలెడ్జ్‌ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగుప్రజలు ముందుండాలని …

Read More »

తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం

-హైదరాబాదులో వంశీ అంతర్జాతీయ ఉగాది పురస్కారాలు -ముఖ్య అతిధిగా పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి వైభవాన్ని దశదిశలా చాటుతున్న మహనీయులకు ఉగాది పురస్కారాలు అందించటం గర్వకారణం అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభావేదికపై అర్ధ శతాబ్ది సాంస్కృతిక సేవా సంస్థ “వంశీ ఇంటర్నేషనల్ – ఇండియా” ఆధ్వర్యంలో “53వ వంశీ అంతర్జాతీయ ఉగాది …

Read More »

Telangana askes to take active part in Cooling Solutions Survey

-Centre Launches National Survey to Shape Energy-Efficient Cooling Solutions. -National Survey aims at shaping Energy-Efficient Cooling Solutions& Reducing Carbon Emissions. Hyderabad, Neti Patrika Prajavartha : In its endeavor to Accelerate Energy-Efficient in a Big Way and to provide the Fruits to the Stake Holders/ Consumers Telangana State has been asked by Bureau of Energy Efficiency GOI to play a pivotal …

Read More »

అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు రూ.3 లక్షల విరాళం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్‌కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

Read More »