Breaking News

సీఎం చంద్ర‌బాబుకు ఎంపికేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్డీయే భాగస్వామిగా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించేందుకు ఢిల్లీ విచ్చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఎంపి కేశినేని శివ‌నాథ్ ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. ఆదివారం హైద‌రాబాద్ బేగం పేట విమానాశ్ర‌యం నుంచి సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, బ‌స్తిపాటి నాగ‌రాజు, రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్ ల‌తో క‌లిసి ఢిల్లీ విమానాశ్రయంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వాగ‌తం ప‌లికారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు బిజెపి అభ్య‌ర్థుల‌ త‌రుఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విచ్చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *