తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతమ్మ అమ్మవారి తిరనాళ్ళలో జరిగిన ప్రభల ఘర్షణల మీద ఏకపక్షంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా రూరల్ జోన్ డి.సి.పి మహేశ్వర రాజు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్,జాగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. 17-03-2025 న తెల్లవారు జామున శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లసందర్బంగా అమ్మవారికి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమలు సమర్పించుటకు అన్ని రాజకీయ పార్టీల వారు ప్రభలు కట్టుకొని వస్తుండగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ కూడలి సమీపంలో టీడిపి.వైసీపీ వర్గీయలు మధ్యలో ఘర్షణలు జరిగి ఇరు వర్గాల వారు చెప్పలు రాళ్లు ఇసురుకోగా మధ్యలో ఉన్నారు పోలీస్ వారికీ తగిలి కొందరికి గాయాలు అయినవి ఇది దురుదుష్టం యదార్థం!సదరు పోలీసువారు ఏకపక్షంగా కేవలం వైసీపీ కార్యకర్తలు పైనే కేసులు కట్టడం బాధాకరం.. సదరు విషియాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాళ్లు విసురుకున్నాది ఇరుపార్టీ వారు కావునా డిపార్ట్మెంట్ వారికీ దెబ్బలు తగలటవలన ఇరుపార్టీల వారిపై కేసులు కట్టవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో జిల్లా రైతు విభాగం అద్యక్షులు ఏలూరి శివాజీ,దుర్గ గుడి మాజీ డైరెక్టర్ నంబురి రవి,mpp గాంధీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ముప్పాళ్ల/నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *