తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ నందు కుటుంబ సభ్యులతో కలిసి సామాన్య భక్తుల వలె అందరితో కలిసి భోజనం చేసారు.
Prajavartha Online Telugu News