-ఆగష్టు 8 వరకు ఆఫర్ల హంగామా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఎంతో పుణ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా, భక్తి శ్రద్ధలతో మరియు శాశ్వత సౌందర్యంతో ఈ వేడుకలు జరుపుకోవడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది. పవిత్రమైన ఈ పండుగను స్మరించుకుంటూ, మీ పండుగ వేడుకలకు మెరుపులు అధడానికి మరియు ప్రతి పండుగకు ప్రాముఖ్యతను జోడించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిన 100% జెన్యూన్ ఆఫర్లను మలబార్ గోల్డ్ & డైమండ్స్ అందిస్తోంది. ఈ పండుగలో భాగంగా అన్ని బంగారం, అన్కట్ వజ్రాలు మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% ఫ్లాట్ తగ్గింపును వినియోగదారులు పొందవచ్చు. అదనంగా, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును అందిస్తోంది మలబార్. 2025 ఆగస్టు 8వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. నియమ నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.మలబార్ ప్రామిసెస్” ద్వారా నమ్మకం, పారదర్శకత మరియు కస్టమర్ సంతృప్తి అనే ప్రధాన విలువలను మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఎల్లప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంది. ప్రతి ఆభరణం 100% హెచ్ యు ఐడి ధృవీకరణతో, పూర్తి ప్రామాణికత మరియు ట్రెసబిలిటీని నిర్ధారిస్తుంది. ప్రతి ఆభరణం కఠినమైన 28 పాయింట్ల నాణ్యత తనిఖీలకు లోనవుతుంది మరియు ప్రతి కొనుగోలుకు ఒక సంవత్సరం ఉచిత బీమా మద్దతు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్లలో మీ నగలకు జీవితకాల ఉచిత నిర్వహణ లభిస్తుంది, అలాగే వినియోగదారులు తమ పాత బంగారం మరియు వజ్రాలు మార్పిడి చేసుకున్నప్పుడు 100% విలువ లభిస్తుందనే హామీ ఇస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ బలంగా కట్టుబడి ఉంది. మలబార్ గ్రూపు తమ లాభాలలో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, ఆకలి నిర్మూలన మరియు మహిళా సాధికారత కార్యక్రమాలకు కేటాయించడం ద్వారా సమాజంలో స్థిరత్వ స్థాపన తమ వ్యాపార నైతికతలో ప్రధానమని భావిస్తోంది. ఎప్పుడైన, ఎక్కడి నుండైనా వినియోగదారులు తమకు నచ్చిన ఆభరణాలను సౌకర్యవంతంగా కొనుగోలు చేయడానికి www.malabargoldanddiamonds.com వెబ్ సైట్ బ్రౌజ్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది.
Prajavartha Online Telugu News