రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డా బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా పిడి నాతి బుజ్జి మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News