వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ ను రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, విశాఖపట్నం ఎంపీ ఎమ్.భరత్ కుమార్ , టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వీక్షించారు. వీరికి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి మ్యాచ్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ , స్టేడియం చైర్మన్ ప్రశాంత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News