విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఫిల్ డెల్ఫియా చర్చిలో పాస్టర్ చార్లెస్ పి జాకబ్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మరియు టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్లెస్ పీజాకబ్ మాట్లాడుతూ మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని ఆహ్వానించినప్పుడే మనం అద్భుతాలు సృష్టించగలుగుతామన్నారు. సంబంధాలను సులువుగా వదులుకోవద్దన్నారు. పోతిన మహేష్ మాట్లాడుతూ ఒక సంవత్సరానికి కావలసినటువంటి శక్తిని క్రిస్టమస్ రోజున ఈ ప్రార్థన మందిరం నుంచి పొందగలుగుతున్నామన్నారు. నిజమైన స్నేహానికి నిర్వచనం చార్లెస్ అని అన్నారు. దేని పట్ల వ్యామోహం లేదు భగవంతుడు ఆశీస్సులతో ప్రజా శ్రేయస్సుకై పని చేస్తామన్నారు.
Prajavartha Online Telugu News