Breaking News

రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రమాదాలు నివారించుటకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గోడపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఇందుకోసం రవాణా శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల్లో విస్తృతంగా రహదారి భద్రతపై చైతన్యం తీసుకొని వచ్చి రహదారి ప్రమాదాలను నివారించాలన్నారు. వాహనాలు నడపడంలో శిక్షణతో భద్రత లభిస్తుందని అలాగే సాంకేతికత ద్వారా పరివర్తన చెందాలన్నారు. ఇందులో ముఖ్యంగా వాహనాల డీలర్లను, లారీ యజమానుల సంఘాలను, డ్రైవర్ శిక్షణ కేంద్రాలను భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు, డిపిటీవో వెంకటేశ్వర్లు, ఎంవిఐలు సిద్ధిక్, నాని, నారాయణస్వామి, సంగీతరావు ఏఎంవిఐ సోనీ ప్రియా తదితర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *