-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్యాన్ని తగ్గించే దిశగా మొక్కలను నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఉచిత పండ్ల మరియు పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో గల మూడు నియోజకవర్గాలలో ప్రజలకు ఉచితంగా పండ్ల మరియు పూల మొక్కలను నేటి నుండి పంచ బోతున్నారని ఆసక్తిగల ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, ప్రజలందరు పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు.
Prajavartha Online Telugu News