అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆకర్షించి అగ్రస్థానంలో ఏపీ.
⦁ ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలకు గానూ పెట్టుబడుల్లో గరిష్ట వాటాను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్.
⦁ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నివేదికలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచిన ఏపీ.
⦁ ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% వాటాను దక్కించుకున్నట్టు వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక.
⦁ దేశంలోని మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో 51.2% శాతం మేర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలే ఆకర్షించిట్టు నివేదికలో వెల్లడి.
⦁ పొరుగు రాష్ట్రం తెలంగాణా 9.5 శాతం పెట్టుబడులతో తదుపరి స్థానంలో ఉన్నట్టు తేల్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక.
⦁ మొత్తం 26 లక్షల కోట్ల పెట్టుబడులకు గానూ అత్యధికంగా 22 శాతం ఇంధన రంగం, 21 శాతం రసాయన పరిశ్రమలు, 17 శాతం మెటల్ ఉత్పత్తులు, 10 శాతం ఐటీ రంగంలో వచ్చినట్టు నివేదికలో స్పష్టం.
Prajavartha Online Telugu News