విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-3 కార్యాలయం పటమట నందు సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 22 కేసులపై విచారణ జరిపి వారికి Rs.5,410/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని మొబైల్ కోర్ట్ జడ్జి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్స్ రమేష్ బాబు, బాలాజీ శ్రీనివాస మూర్తి , శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News