Breaking News

ఇప్పటి వరుకు 28,000 ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ చేసాం

-విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు శంకల్పిస్తున్న హరిత ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని అన్నారు. అందులో మామిడి 6000, జామ 6000, నిమ్మ 6000 మరియు నూరువరహాలు 10,000 పంపిణీ చేశామని, సంక్రాంతి పండుగ తర్వాత గులాబీ మరియు మందార మొక్కలను కూడా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం ద్వారా నగర కాలుష్యాన్ని తగ్గించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పని చేస్తుందని ప్రజలందరూ దీనిలో భారీగా పాల్గొని వారు కూడా కాలుష్యాన్ని తగ్గించే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *