Breaking News

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు… : నక్కా వీరభద్రరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారత దేశ ప్రాంతాలలో జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి పండుగని ప్రజలకు నక్కా వీరభద్రరావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని, ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారన్నారు. సంక్రాంతి పండుగను మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతలు, దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గోపూజలతో మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందన్నారు. ప్రజలంతా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను నక్కా వీరభద్రరావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *