Breaking News

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, గురువారం బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ ను సందర్శించడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)- 2026 కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధం అనీ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది, దీనితో పాటుగా ఆటో రిక్షా వాహనదారులకు సంభందిత వాహన పత్రాలు (పర్మిట్ / ఫిట్నెస్ లైసెన్సు / ఇన్షూరెన్స్ ) తప్పనిసరిగా చెల్లుబాటులో వుండాలని మరియు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత, బాధ్యతాయుతమైన ప్రవర్తన గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, ఎం. రవి కుమార్, జి. రామ్ నారాయణ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, బి ఉమా మహేశ్వర రావు, జి. ప్రణీత్ కుమార్ పి.వి.వి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *