అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలందరికీ విశిష్ట కనుమ పండగ శుభాకాంక్షలు. పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశు పక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది. ‘‘అన్నదాతా సుఖీభవ’’ అంటూ ఆశీర్వదిస్తుంది. కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Prajavartha Online Telugu News