గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జిఎంసి మెయిన్ ఆఫీస్ లోని కాల్ సెంటర్ 0863-2345103 లేదా వాట్సప్ నం.9849908391 కి ఫిర్యాదులు అందించవచ్చని పేర్కొన్నారు
Prajavartha Online Telugu News