గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు లబ్ధిదారులకు సుమారు రూ.7 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ఓసీ (LOC) పత్రాలను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధవరం గ్రామానికి చెందిన వల్లె రామారావు గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.3,04,687, అలాగే వీరపనేని గూడెం గ్రామానికి చెందిన పఠాన్ రిహాన్ ఖాన్ గారికి రూ.4,00,807 చొప్పున ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మాట్లాడుతూ, ఆపద సమయంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తూ, అవసరమైన వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.
Prajavartha Online Telugu News