Breaking News

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 16 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 4,830/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

ఈ సందర్భంగా రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని మొబైల్ కోర్ట్ జడ్జి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్స్ సలీం మహమ్మద్, శివరామ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రనాథ్, వడ్డాది శ్రీనివాసరావు , జైపాల్,శివరామ కృష్ణ, యేసు రత్నం, మేరుగా రాజేష్, బుజ్జి బాబు మరియు గోపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *