Breaking News

తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ పెట్టండి…

-క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు సకాలంలో చేయండి…
-రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి…
-రక్షిత తాగునీటి పథకాల పనులను వేగవంతం చేయండి…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించి అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.

తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతి పై మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ నందు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యే శ్రద్ధ తీసుకోవాలని తాగునీటిని సరఫరా పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేసి పరిశుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులను సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, భూగర్భజల శాఖ, విద్యా, మహిళ శిశు సంక్షేమ తదితర శాఖాల అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తాగునీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ చేయడం క్లోరినేషన్ కలిపిన మాత్రమే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రతి నెల బైలాజికల్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీలలో తాగునీటి టెస్టులకు సంబంధించిన తేది నివేదిక వివరాలను పొందుపరుస్తూ తప్పనిసరిగా డిస్ప్లే బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరా చేసేందుకు జలజీవన్ మీషన్ పథకం ద్వారా 534 పనులను మంజూరు కాగా వీటిలో 433 పనులు పూర్తి చేయడం జరిగిందని మరో 101 పనులు పూర్తి చేయవలసి ఉందని వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పూర్తి చేయడంలో అలసత్వం వహించే గుత్తేదారులు అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాగునీటి సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఓ అండ్ ఎం) పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అవసరమైన చోట్ల మరమ్మతులు చేయడం, పైపులైన్ల లీకేజీలు వంటివి లేకుండా చూడటం, పంపు హౌస్, మోటార్లు సక్రమంగా పనిచేసేలా చూడటం వంటివాటిపై క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ సిహెచ్ తిరుమల కుమార్, ఐసిడిసి పిడి షేక్ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా వ్యవసాయ అధికారిణి డిఎంఎఫ్ విజయ కుమారి, డిఇవో చంద్రకళ, డిఎం & హెచ్ ఓ, డా. ఎం. సుహాసిని, డిపివో లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *