అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అలనాటి మేటినటి, దివంగత కృష్ణవేణి జీవిత చరిత్ర ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, ఈ పుస్తక ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాణి బ్రహ్మం, కొత్తపల్లి శ్రీధర్, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తన పుస్తకం సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవం అని రచయిత సంతోషం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News