అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, భవనాలు/లే అవుట్ల అనుమతులు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ ఐ.ఏ.ఎస్.లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేలో అర్జీదారులు తెలియజేసిన పలు ఫిర్యాదులకు..కమిషనర్ ఆదేశాలమేరకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వద్దని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. అలాగే రైతుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ డేలో 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఇవి:
1.అమరావతిలో భూమి వ్యవహారాలు = 17
2. డెవలప్మెంట్ ప్రమోషన్= 3
3. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్= 2
4. ప్లానింగ్= 2
5. సామాజిక సంక్షేమం(ఇంజినీరింగ్)= 2
6. H&B(హౌసింగ్)= 1
7. సామాజిక సంక్షేమం(ఇంజినీరింగ్)= 1
గ్రీవెన్స్ డేలో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, ల్యాండ్స్ విభాగ డైరెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్(క్యాపిటల్ సిటీ) వసంతరాయుడు, చీఫ్ ఇంజినీర్ జి. వెంకటేశ్వరరావు, డెవలప్మెంట్ ప్రమోషన్ అడిషనల్ డైరెక్టర్ వి. సునీత, ప్లానింగ్ విభాగ డైరెక్టర్(FAC) బి. సురేష్ కుమార్, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సి.హెచ్. మధుసూధనరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.శేషిరెడ్డి, కే.ఎస్.భాగ్యరేఖ, జి. రవీందర్, బి. సాయి శ్రీనివాస నాయక్, పి.పద్మావతి, ఏ.జి. చిన్నికృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, సామాజిక సంక్షేమ విభాగ DCDO బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News