-మేం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించిన శాంతిభద్రతల్ని కాపాడతాం
-శాంతిభద్రతల్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదు
-తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేరమయ రాజకీయాలు వైసీపీ సిద్ధాంతం. వారి హయాంలో జరిగిన చట్టవిరుద్ధ పాలనే దీనికి నిదర్శనం. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది. ప్రజలకు సేవ చేయటం వారికి సాధికారిత కల్పించటం మా సిద్ధాంతం. వైసీపీ నిజ స్వరూపం బయటపడుతున్న కొద్దీ అసహనంతో దూషణలకు దిగుతున్నారు. వాళ్లు విధ్వంసం చేసిన వ్యవస్థలు పునర్నిర్మాణం జరుగుతున్న తీరును చూసి ఓర్వలేక పోతున్నారు. రాజ్యాంగమే సుప్రీం. మేం నెలకొల్పిన శాంతిభద్రతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరుతాం. చట్ట ఉల్లంఘనలకు ఎవరినీ అనుమతించేది లేదు.
Prajavartha Online Telugu News