మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు ఎంతగానో పాటుపడుతున్నారని వారి సంక్షేమం కోసం నిధులు సమకూర్చడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ సాయిబాబు ఆధ్వర్యంలో పతాక దినోత్సవ నిధి కోసం దాతల నుండి సేకరించిన 6.65 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును సైనిక సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ హరి కిషోర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, మెప్మా పీడీ సాయిబాబు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News