Breaking News

సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సియం ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఫిబ్రవరి 28న సిఎస్ గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రివర్యుల ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టిటిడి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు ఉన్నతాధికారులు,సచివాలయ వివిధ విభాగాల అధికారులు,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *