Breaking News

ఉద్యోగుల సంక్షేమమే మా లక్ష్యం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాల అర్హులకు చేరవేయడంలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర అని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తే, కూటమి ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. అనంతరం బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘ నేతలు మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వి.అనురాధ, వి.గుణవంతుడు, సురేశ్, సతీష్ సహా పలువురు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *