గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) ఆధ్వర్యంలో స్వామి థియేటర్ కాంపౌండ్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తదుపరి ముస్లిం సోదరులకు అన్నదానం చేస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో APIDC చైర్మన్ డేగల ప్రభాకర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News