గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఏపిఇట్కో) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో భాగంగా ఏపిఇట్కో ప్రతినిధులు రూపొందించిన డిపిఆర్ ని పరిశీలించామని,అందులో సూచించిన మార్పులతో త్వరలో సమగ్ర డిపిఆర్ అందించాన్నారు. డిపిఆర్ పై ఏపిఇట్కో ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని జిఎంసి ఎస్ఈ ని ఆదేశించారు.
Prajavartha Online Telugu News