న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలు శనివారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సంధ్యారాణి, కంభంపాటి రామ్మోహన్, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News