Breaking News

బాధ్యత లు స్వీకరించిన జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పశు సంవర్ధక అధికారి టి. శ్రీనివాసరావు బాధ్యత లు స్వీకరించిన అనంతరము గురువారము జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియజేశారు. మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున అమూల్ బల్క్ మిల్క్ sయూనిట్స్ కు పాల వెల్లువ సేకరణ కేంద్రాల ద్వారా పాల సేకరణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రతి రోజు ఆయా కేంద్రల నుంచి 160 లీటర్లు మేర పాలను సేకరించాలనీ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఏరియా వెటర్నిటీ ఆసుపత్రి లో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న టి. శ్రీనివాస రావు ఉప సంచాలకులు గా పదోన్నతి పొంది తూర్పు గోదావరీ జిల్లా పశు సంవర్ధక అధికారిగా లో విధులకు హాజరు కావడం జరిగింది. 1993 లో చిలకలూరి పేట మండలము పశువుల ఆసుపత్రిలో సహాయ పశు వైద్యులు గా జాయిన్ అయ్యారు. కలెక్టర్ ను కలిసిన వారిలో డి ఎ హెచ్ వో డా టి. శ్రీనివాస రావు, కొవ్వూరు డివిజన్ పశు సంవర్ధక అధికారి జీ. రాధాకృష్ణ లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *