-పిఠాపురం లో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు పొత్తులో ఉన్న అక్కడ టీడీపీ గందరగోళం చేసింది
-పార్టీ అధ్యక్షుడి కే నిరసన గళం వినిపించారు
-పిఠాపురంలో లో పవన్ ను కాపాడాల్సిన బాధ్యత మనకుంది
-వెస్ట్ లో జనసేన బలంగా వుండటం వల్లే వైసీపీ అభ్యర్దిని మార్చారు
-పశ్చిమం లో జనసేన నుండి పోటీ చేసి తీరతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ… పిఠాపురం లో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారని,పొత్తులో ఉన్న అక్కడ టీడీపీ గందరగోళం చేసిందని,పార్టీ అధ్యక్షుడి కే నిరసన గళం వినిపించారని, ఇది పొత్తు ధర్మం కాదు…అని,పిఠాపురంలో లో పవన్ కళ్యాణ్ ని కాపాడాల్సిన బాధ్యత మనకుందని. పొత్తులో ఉన్న పార్టీ లు దీనిపై స్పందించటం లేదని, పొత్తు ధర్మం లో అందరూ కలిసి రావాలని, అధ్యక్షుడే బాగొకపోతే రాష్ట్రం ఎలా బాగుంటుందని, జనసెనలో దీనిపై ఎవ్వరూ ఎందుకు మాట్లాడరని, నాయకులు నష్ట నివారణకు ఎందుకు చర్యలు తీసుకోరని, దీనిపై చర్చించాల్సిన అవసరం వుందని, విజయవాడ పశ్చిమ సిట్ జనసేన కు ఇవ్వాలని, పవన్ కు పోతీన మహేష్ విజ్ఞప్తి అని
పోరాటాలు చేశాం, కేసులు పెట్టించుకున్నంమని,పదవులు క్యాడర్ ను బ్రతికించటానికే అని.. విజయవాడ పశ్చిమం లో జనసేన క్యాడర్ ఉండాలనిప్రతి పోరాటం విజయవాడ వేదికగా జరిగిందని వెస్ట్ లో జనసేన బలంగా వుండటం వల్లే వైసీపీ అభ్యర్దిని మార్చారని బలంగా ఉన్న చోట జనసేన కు సిట్ కేటాయించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు బ్యాంకు సంపాదించామని.. ముద్రగడ్డ లేఖలు ఆపింది పశ్చిమ నియోజక వర్గమే అని. పశ్చిమం లో జనసేన నుండి పోటీ చేసి తీరతంమని అన్నారు.
Prajavartha Online Telugu News