Breaking News

వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ

వారణాసి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత, చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *