Breaking News

కౌంటింగ్ ప్రారంభమానికి ముందు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ఫలితాలు వెల్లడించే సమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!!

1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి.
ఈ ఫారం 17సీ ఏజెంట్లు సంతకాలు లేనిదైతే ఏదో అవకతవకలు జరిగినట్లు భావించాలి.

2) ప్రతి పోలింగ్ కేంద్రం (Polling Station) ఫారం 17సీ లో వున్న కంట్రోల్ యూనిట్ (C.U No) నెంబరు, మిషన్ పైన వున్న నెంబరు సరిచూసుకోవాలి. పోలింగ్ రోజున ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీ.యు (కంట్రోల్ యూనిట్) మార్చినా అది ఫారం 17 సీ మార్చినట్లు చూపించివుండాలి. ఒక వేళ ఆ నెంబరు మ్యాచ్ కాకపోతే కౌంటింగ్ ఆపి ఆర్.ఓ గారితో సంప్రదించి కౌంటింగ్ ప్రారంభించాలి.

3) ఫారం 17సీ లో నమోదైన ఓట్ల సంఖ్య మరియు సీ.యు (కంట్రోల్ యూనిట్)లో చూపిస్తున్న ఓట్ల సంఖ్య సమానంగా వుండాలి. ఒక వేళ లేక పోతే రిటర్నింగ్ అధికారి అడిగి నివృత్తి చేసుకొన్న తర్వాత రిజల్ట్ కౌంటింగ్ ప్రారంభించాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రెవెన్యూ వారు ప్రిసైడింగ్ అధికారులకు సరైన శిక్షణ లేని కారణంగా కొంత మంది ప్రిసైడింగ్ అధికారులకు సీ.ఆర్.సీ గురించి (Close Result Clear) అర్ధం కాక పోవడం వల్ల కొంత సమస్య వచ్చింది. వాస్తవంగా ఏజెంట్లు సమక్షంలో మాక్-పోల్ జరిపి అందులో వున్న ఓట్లను సీ.ఆర్.సీ (Close Result Clear) చేసి వాస్తవ ఎన్నిక జరగాలి. ఒక వేళ సీ.ఆర్.సీ చేయని సందర్భంలో మాక్-పోల్ చేసిన ఓట్లను వి.వి.పాట్ నుండి వేరు చేసి సీల్డ్ కవర్ (వైట్ బాక్స్)లో వుంచిన వాటిని లెక్కించి, సీ.యులో వాస్తవంగా పోల్ అయిన గ్రాస్ ఓట్ల నుండి తీసివేసి నికరంగా వచ్చిన ఓట్లను తుది ఓట్లుగా పరిగణించాలి.

4) కంట్రోల్ యూనిట్ కు వున్న అన్ని సీళ్ళను ఫారం 17సీ లో వున్న నెంబర్లతో సరిగా వున్నాయా లేదా ఖచ్చితంగా సరిచూసుకోవాలి.

5) మిషన్ పైన సీళ్ళు ఏవైనా చిరిగివున్నాయా లేదా సరిగ్గా వున్నాయా? తనఖీ చేసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన అంశం.

6) కంట్రోల్ యూనిట్ (CU)పైన అన్ని సీళ్ళ పైన ఏజెంట్లు మరియు అధికారుల సంతకాలు వుంటాయి, అవి సరిగ్గా వున్నాయా లేదా సరిచూసుకోవాలి. అనుమానం వస్తే నివృత్తి చేసుకొన్న తర్వాతే కౌంటింగ్ ప్రారంభించాలి.

7) పోలింగ్ సమయంలో ఏదైనా పోలింగ్ కేంద్రంలో సాంకేతిక కారణాలతో మరో మిషన్ వాడి వుంటే, వాటి వివరాలు కూడా ఫారం 17సీ నమోదు చేసి వాటి వివరాలు కూడా సరి చూసుకోవాలి.

Check Also

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా…

-అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు మంజూరు -ఏపీయూడబ్ల్యూజే నేతలకు మంత్రి పార్థసారధి హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *